Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో వెళ్తూ.. డోర్ తెరిచి.. ఓ ఇంటి మెట్లపై పసికందును వుంచి?

నిన్నటికి నిన్న నాచారంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును ముళ్లపాలు చేసిన సంగతి తెలిసిందే. గత ఆదివారం కేరళలో ఐదు రోజుల పసిపాపను ఓ జంట చర్చి వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయింది. నాలుగో బిడ్డను కన్నామని అందరూ తమను

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (09:13 IST)
నిన్నటికి నిన్న నాచారంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును ముళ్లపాలు చేసిన సంగతి తెలిసిందే. గత ఆదివారం కేరళలో ఐదు రోజుల పసిపాపను ఓ జంట చర్చి వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయింది. నాలుగో బిడ్డను కన్నామని అందరూ తమను చిన్నచూపు చూస్తారనే ఉద్దేశంతో ఆ బిడ్డను చర్చి వద్ద వదిలిపెట్టామని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. ఆ తర్వాత వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
తాజాగా ఓ మహిళ కారులో వెళ్తూ వెళ్తూ డోర్ తెరిచి గుడ్డలో చుట్టి వుంచిన బిడ్డను ఓ ఇంటి మెట్లపై వుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
 
ఇంకా చిన్నారిని ప్రభుత్వ అధికారులు కాపాడి.. స్థానిక ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. అయితే అప్పుడే పుట్టిన పాపను అలా వదిలిపెట్టి వెళ్లిపోవడం దారుణమని.. ప్రస్తుతం పాప పరిస్థితి విషమంగానే ఉందని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. చిన్నారి కోలుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments