Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్కింగ్ చేసిన స్కూలు బస్సులో కొండ చిలువ.. ఆదివారం కావడంతో తప్పిన ముప్పు

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (12:49 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే దృశ్యం ఒకటి కనిపించింది. పార్కింగ్ చేసిన స్కూలు బస్సులోకి భారీ కొండ చిలువ ఒకటి దాక్కుంది. దీన్ని గమనించిన స్కూలు సిబ్బంది పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులతో పాటు అగ్నిమాపకదళ సిబ్బంది, అటవీ సిబ్బంది వచ్చి ఆ కొండ చిలువను తాళ్ళతో బంధించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయబరేలిలో ఈ ఘటన జరిగింది. పైగా, ఆదివారం కావడంతో స్కూలు బస్సు పార్కింగ్ చేశారు. 
 
స్థానికంగా ఉండే ర్యాన్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సులో ఈ కొండ చిలువ కనిపించింది. ఈ బస్సును డ్రైవర్ తన ఇంటి సమీపంల పార్క్ చేశాడు. బస్సులోకి దూరిన ఈ కొండచిలువ అందులో తిష్టవేసింది. దీన్ని గమనించిన డ్రైవర్, స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 
 
వెంటనే, ఆ ప్రాంత సర్కిల్ అధికారి వందన సింగ్, సిటీ మేజిస్ట్రేట్ పల్లవి మిశ్రా అక్కడికి చేరుకున్నారు. కొండచిలువను గమనించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారొచ్చి అరగంట పాటు కష్టపడి ఒడుపుగా బయటకు తీసి అటవీ ప్రాంతంలో వదలిపెట్టారు. బస్సులో దాక్కున్న కొండచిలువను బయటకు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 
 
రక్షించిన కొండ చిలువ పదకొండున్నర అడుగుల పొడవు, 80 కేజీల బరువు ఉన్నట్టు అధికారులు తెలిపారు. దానిని దాల్మౌ అడవిలో వదిలిపెట్టినట్టు పేర్కొన్నారు. ఆదివారం కావడంతో అదృష్టవశాత్తు బస్సు పార్కింగులో ఉందని, లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు పేర్కొన్నారు.
 
పార్క్ చేసిన బస్సు సమీపంలో మేకలు మేస్తుండడం కొండ చిలువను ఆకర్షించిందని, వాటి కోసం కొండచిలువ వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు. కొండచిలువను చూసి స్థానికులు కేకలు వేయడంతో అది భయపడి బస్సులోకి వెళ్లి దాక్కుని ఉంటుందని పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments