Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిపై అసభ్య కామెంట్లు చేశారనీ... వదలకుండా పొడిచాడు...

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (18:09 IST)
ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చేవారిని చూస్తుంటాం, తీసేవారినీ చూస్తుంటాం. ఇలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. కేవలం ప్రియురాలిపై అసభ్యంగా కామెంట్స్ చేశారని ఇద్దరిని దారుణంగా కత్తితో పొడిచాడు ప్రేమికుడు. దాంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేసారు. 
 
వివరాల్లోకి వెళితే, 24 ఏళ్ల రాహుల్ కేశవ్‌రావ్ సేవత్కర్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి డిన్నర్ చేయడానికి స్థానికంగా ఉండే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ స్టాల్‌కి వచ్చాడు. అక్కడ ఉన్న అక్షయ్‌ అశోక్, అన్షుల్ అనే ఆకతాయిలు అతని ప్రేయసిని చూసి కామెంట్స్ చేయడం ప్రారంభించారు. అసభ్యంగా మాట్లాడారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన రాహుల్ వారిపై కోప్పడ్డాడు. వాగ్వివాదానికి దిగాడు. గొడవ కాస్త పెద్దదై పోట్లాటగా మారింది. 
 
ఈ నేపథ్యంలో వారిద్దరినీ రాహుల్ కత్తితో పొడిచాడు. నిర్విరామంగా 14 పోట్లు పొడిచాడు. ఫుడ్ కోర్ట్ యజమాన్యం వచ్చి అడ్డుకునేవరకూ  దాడి ఆపలేదు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న వారిని అక్కడే వదిలేసి ప్రియుడు, ప్రియురాలు పరారయ్యారు. గాయపడిన వారిని ఫుడ్ కోర్ట్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. వారిలో అక్షయ్‌‌కి మెడ, చేతులు, ముఖానికి, కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. ఆక్షయ్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటనకు కారణమైన ప్రియురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments