Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో చేరిన కేరళ మాజీ సీఎం - ఐసీయూలో చికిత్స

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (09:35 IST)
కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రముఖ నాయకుడు వీఎస్ అచ్యుతానందన్ ఆస్పత్రిలో చేరారు. 92 యేళ్ల వయసులో ఒకవైపు తీవ్ర వృద్ధాప్య సమస్యలపాటు.. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆయన్ను రాజధాని తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. 
 
ప్రస్తుతం తన తండ్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని అతని కుమారుడు అరుణ్ కుమార్ తన ఫేస్‌బుక్ లో సమాచారాన్ని పోస్ట్ చేశారు. అచ్యుతానందన్ మూత్రపిండాల సమస్యలు, గ్యాస్ట్రో ఎంటెరిటీస్‌తో బాధపడుతున్నాడని, అతన్ని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నామని శ్రీ ఉత్రదోమ్ తిరునాల్ ఆసుపత్రి వైద్యులు మెడికల్ బులెటిన్ విడుదల చేశారు.
 
కాగా, రెండేళ్ల క్రితం అచ్యుతానందన్ స్ట్రోక్‌తో బాధపడి తర్వాత అలపుజా జిల్లాలోని తన సొంత పట్టణానికి వచ్చారు. దిగ్గజ కమ్యూనిస్ట్ నాయకుడైన అచ్యుతానందన్ అనారోగ్యం కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. 2006లో తొలిసారి కేరళ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఈయన అత్యంత వృద్ధ ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కిన విషయం తెల్సిందే. ఆసమయంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసి చర్చల్లో నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాధాభాయ్ సాంగ్ లో మన్నారా చోప్రా మాస్ డ్యాన్స్ మూమెంట్స్

నేడు సినీ పరిశ్రమ తరఫున అభినందనలు మాత్రమే - మరోసారి సమస్యలపై చర్చ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటీ!

పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన అగ్ర నిర్మాతలు - చిన్న నిర్మాతలు అలక

కళ్యాణ్ రామ్‌ యాక్షన్‌ చిత్రంలో విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments