Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై ఆర్.కె.నగర్ బైపోల్ ఓటింగ్... బరిలో 59 మంది అభ్యర్థులు

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే.నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (09:13 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే.నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్థానిక ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. 
 
ఈ ఉప ఎన్నికలో భాగంగా 256 పోలింగ్‌ కేంద్రాల్లో  ఓటింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి మరుదుగణేశ్‌, అన్నాడీఎంకే అభ్యర్థి ఇ.మధుసూదన్‌, అన్నాడీఎంకే అసమ్మతినేత టీటీవీ దినకరన్‌, బీజేపీ నేత కరు నాగరాజన్‌‌లతో పాటు మొత్తం 59 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.
 
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.28 లక్షలు. ప్రతి పోలింగ్‌ కేంద్రం దగ్గర 50 మంది పోలీసులు, 15 మంది పారామిలటరీ బలగాలు, 9 మంది చొప్పున ఐఏఎస్‌, ఐపీఎస్‌, నలుగురు ఐఆర్‌ఎస్‌ అధికారులను పర్యవేక్షణగా నియమించారు. 
 
నియోజకవర్గ వ్యాప్తంగా 200 సీసీ టీవీ కెమెరాలను అమర్చారు. 75 ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు విధుల్లో ఉన్నాయి. 45 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ భద్రతా సిబ్బంది కాకుండా, స్థానిక పోలీసులు కూడా పోలింగ్ భద్రతలో నిమగ్నమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments