Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుపాకీ లైసెన్సులు ఇప్పించినవారికే ఓట్లు వేస్తాం... ఓటర్ల వింత డిమాండ్!!!

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (10:11 IST)
దేశంలో మినీ సమరంగా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఈ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ కూడా ఒకటి. అయితే, ఈ రాష్ట్రంలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలను ఓటర్లు వింత కోరికలు కోరుతున్నారు. అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో ఓటర్లు కొత్త రకం డిమాండ్లు చేస్తుండటంతో ఖంగుతింటున్నారు. తమకు తుపాకీ లైసెన్స్ ఇప్పించే అభ్యర్థులకు మాత్రమే ఓట్లు వేస్తామని తెగేసి చెబుతున్నారు. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది. దీన్ని నిర్మూలించడానికి భిండ్ నియోజకవర్గ ఓటర్లు తమకు తుపాకీ లైసెన్సులు కావాలని కోరుతున్నారు. తుపాకీ లైసెన్స్ ఉంటే దేశంలో ఎక్కడైనా సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు చేసుకోవచ్చని వారి ఉద్దేశం. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు కేంద్ర రాష్ట్రాల్లోని బీజేపీ పాలకులు ఎలాంటి పరిష్కారం చూపించలేదని, అందుకే తుపాకీ లైసెన్సుల డిమాండ్ న్యాయమైనదేనని భిండ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రాకేశ్ సింగ్ చుతుర్వేది అంటున్నారు. ఇటు బీజేపీ అభ్యర్థి నరేంద్ర సింగ్ కుశ్వాహా కూడా అధికారంలోకి రాగానే ప్రభుత్వంతో మాట్లాడి ఓటర్ల డిమాండ్‌ను నెరవేరుస్తానని హామీ ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments