Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తను చూడాలి.. పెరోల్ మంజూరు చేయండి... శశికళ

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను చూసేందుకు అనుమతి ఇవ్వాలని బెంగుళూరు పరప్పణ అగ్రహార జైలు అధికారులను అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ కోరారు. ఇందుకోసం

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (07:31 IST)
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను చూసేందుకు అనుమతి ఇవ్వాలని బెంగుళూరు పరప్పణ అగ్రహార జైలు అధికారులను అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ కోరారు. ఇందుకోసం తనకు పెరోల్ మంజూరు చేయాలంటూ ఆమె దరఖాస్తు చేసుకున్నారు. 
 
కాగా, శశికళ భర్త వి.నటరాజన్ గత కొంతకాలంగా కాలేయం, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతూ... ఆసుపత్రిలో డయాలసిస్‌ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భర్తను చూసేందుకు శశికళ పెరోల్ కోరారని ఆమె బంధువు, అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్ తెలిపారు. ఒకవేళ ఆమె పెరోల్ పై వస్తే తమిళనాడు రాజకీయాలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలెర్ట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు.. టీటీవీ దినకరన్‌తో పాటు.. ఆయన అనుచరులపై దేశ ద్రోహం కేసు నమోదైంది. తమ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామితో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఉన్న కరపత్రాలను పంచినందుకు గాను ఈ కేసు నమోదైంది. 
 
సోమవారం సీఎం ప‌ళ‌ని స్వామి త‌మ అధికారుల‌తో కీల‌క స‌మావేశం నిర్వ‌హిస్తుండ‌గా, దిన‌క‌ర‌న్‌ త‌న మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి ఆ కరపత్రాలను పంచారు. ఈ కేసులో ఆయ‌న‌తో పాటు మరో 15 మంది అతడి అనుచరులపై దేశద్రోహం కేసు నమోదైంది. ఇ‌ప్ప‌టికే దేశ ద్రోహం కేసులో మాజీ ఎమ్మెల్యే వెంకటాచలాన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments