Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ లాక్ 4 సడలింపుతో ఈ నెల 21 నుంచి తాజ్‌మహాల్ సందర్శనకు అనుమతి

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (14:35 IST)
కరోనా వైరస్ కారణంగా దేశంలోని పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాలన్నీ మూతబడిన విషయం తెలిసిందే. అయితే అన్ లాక్4 లో భాగంగా సెప్టెంబరు 1 నుంచి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలన్నీ ఇప్పటికే తెరుచుకున్నాయి. అయితే యూపీలోని తాజ్ మహాల్, ఆగ్రా పోర్ట్ మాత్రం ఇంకా సందర్శకుల కోసం ఓపెన్ కాలేదు.
 
ఈ క్రమంలో సెప్టెంబరు 21 నుంచి తాజ్ మహాల్, ఆగ్రా కోటను సందర్సకుల కోసం తిరిగి తెరవనున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆగ్రా సర్కిల్ సోమవారం ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ రెండు ప్రపంచ వారసత్వ కట్టడాలను మార్చి 17 నుంచి మూసివేశారు.
 
అయితే ఈ రెండు ప్రాంతాలలో వేర్వేరుగా 2,500 మంది సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. దీంతో పాటు సందర్శకులకు ఎలక్ట్రానిక్ టికెట్ జారీ చేయనున్నారు. పర్యాటకులంతా కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఈ మేరకు అధికారులు వెల్లడించారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments