Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించి స్కూలుకు వచ్చిన టీచర్‌పై చెప్పులు విసిరిన విద్యార్థులు!

వరుణ్
బుధవారం, 27 మార్చి 2024 (09:08 IST)
స్కూలుకు మద్యం సేవించి వచ్చిన ఉపాధ్యాయుడిపై కొందరు విద్యార్థులు చెప్పులు విసిరారు. అతనిపై చెప్పులు విసురుతూ పాఠశాల ఆవరణం నుంచి బయటకు తరిమేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. 
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసే ఓ టీచర్... ప్రతి రోజూ పాఠశాలకు మద్యం సేవించి వచ్చేవాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండ వారిని తిట్టడం ప్రారంభించాడు. దీంతో విసిగిపోయిన విద్యార్థులు చెప్పులు విసిరారు. విద్యార్థుల దాడిని తట్టుకోలేక టీచర్ అక్కడి నుంచి పారిపోయాడు. 
 
కాగా, ఈ టీచర్ తరచూ స్కూలుకు తాగి వచ్చేవాడని విద్యార్థులు తెలిపారు. పాఠాలు చెప్పడం మానేసి తరగతి గదిలోనే ఓ మూల చాప వేసుకుని నిద్రపోయేవాడని అన్నారు. తమకు పాఠాలు చెప్పాలని పలుమార్లు వేడుకున్నా ఏమాత్రం పట్టించుకునేవాడు కాదని వారు ఆరోపించారు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన విద్యార్థులు టీచర్‌కు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments