Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్‌లో గుర్రుపెట్టి నిద్రపోతున్న అమిత్ షా?!

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (13:21 IST)
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వాడివేడిగా సాగుతున్న పార్లమెంట్ సమావేశాల సమయంలో గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు షోషల్ మీడియాలో వైరల్ అయింది. కేంద్ర మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతుంటే.. తన సీట్లో ఉన్న అమిత్ షా మాత్రం పూర్తిగా నిద్రలో మునిగిపోయారు. 
 
రాజ్యసభలో కేంద్ర మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ సీరియస్‌గా మాట్లాడుతుంటే... అమిత్ షా కళ్లు మాత్రం పూర్తిగా మూసుకునిపోయి, శరీరం కూడా సుప్తచేతనావస్థలో ఉంది. అంటే ఆయన మంచి గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఈ ఫోటో చూస్తే తెలుస్తోంది. ఈ ఫోటోను 800 సార్లు ట్వీట్ చేయగా, 2600 మంది లైక్ చశారు. 
 
గతంలో లోక్‌సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొబైల్ ఫోను తదేకంగా చూడటాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. కానీ, ఇపుడు అమిత్ షా గుర్రుపెట్టి నిద్రపోవడాన్ని వారు సమర్థించుకుంటారు. పైగా, ఇది ఇప్పటి కాదనీ, ఆరు నెలల క్రితం ఫోటో అంటూ సమాధానం ఇస్తున్నారు. మొత్తంమీద అమిత్ షా నిద్రఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments