Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..?

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (17:03 IST)
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో మైనర్ బాలికపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సెప్టెంబరు 7న ఇమాలియా సుల్తాన్‌పూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన మైనర్ బాలిక మార్కెట్ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా ఆమెను షీబు, నజీమ్ అనే ఇద్దరు యువకులు అనుసరించారు. నిర్మానుష్యం ప్రాంతంలోకి రాగానే ఆమెను సమీపంలోని చెరుకుతోటలోకి ఎత్తుకెళ్లారు. అక్కడ మరో ముగ్గురు ఉన్నారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరుగా ఆమెపై ఆ ఐదుగురు యువకులు లైంగికదాడి చేశారు. 
 
ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదిరించారు. అంతేకాదు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలికపై లైంగికదాడి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
వీడియో వైరల్ కావడంతో బాధితురాలికి మహిళా సంఘాలు అండగా నిలిచాయి. వారు ధైర్యం చెప్పడంతో ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ వీడియో ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడు శీబును అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నలుగురి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments