Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..?

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (17:03 IST)
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో మైనర్ బాలికపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సెప్టెంబరు 7న ఇమాలియా సుల్తాన్‌పూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన మైనర్ బాలిక మార్కెట్ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా ఆమెను షీబు, నజీమ్ అనే ఇద్దరు యువకులు అనుసరించారు. నిర్మానుష్యం ప్రాంతంలోకి రాగానే ఆమెను సమీపంలోని చెరుకుతోటలోకి ఎత్తుకెళ్లారు. అక్కడ మరో ముగ్గురు ఉన్నారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరుగా ఆమెపై ఆ ఐదుగురు యువకులు లైంగికదాడి చేశారు. 
 
ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదిరించారు. అంతేకాదు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలికపై లైంగికదాడి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
వీడియో వైరల్ కావడంతో బాధితురాలికి మహిళా సంఘాలు అండగా నిలిచాయి. వారు ధైర్యం చెప్పడంతో ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ వీడియో ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడు శీబును అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నలుగురి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments