Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్లు పే చేయమంటే.. రెస్టారెంట్ ఉద్యోగిని బాదేశారు..

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (12:18 IST)
Noida
నోయిడాలో మద్యం మత్తులో ఉన్న నలుగురు వ్యక్తులు తమ బిల్లు చెల్లించమని అడిగినందుకు రెస్టారెంట్ ఉద్యోగిపై దాడి చేసారు. ఈ ఘటన రెస్టారెంట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వడంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి నోయిడా సెక్టార్ 29లోని కుక్ డు కు రెస్టారెంట్‌కు గౌరవ్ యాదవ్, హిమాన్షు, మరో ఇద్దరు వ్యక్తులు వెళ్లారని పోలీసు అధికారి తెలిపారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు రూ.650 బిల్లు కట్టకుండా బయటికి వెళ్లారు. 
 
అయితే బిల్లు పే చేయండని హోటల్  సిబ్బందిలో ఒకరైన షహబుద్దీన్ అభ్యర్థించాడు. దీంతో ఆగ్రహించిన వ్యక్తులు షహబుద్దీన్‌ను దుర్భాషలాడడం ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలో ఒకరు రెస్టారెంట్ ఉద్యోగిని నేలపై పడేలా బలంగా వారు తన్నడం రికార్డ్ అయ్యింది. 
 
అతను లేచి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అతనిని మందు తాగిన వ్యక్తులు చెంపదెబ్బ కొట్టారు. ఈ దాడికి సంబంధించి పోలీసులకు షహబుద్దీన్‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments