Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్లు పే చేయమంటే.. రెస్టారెంట్ ఉద్యోగిని బాదేశారు..

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (12:18 IST)
Noida
నోయిడాలో మద్యం మత్తులో ఉన్న నలుగురు వ్యక్తులు తమ బిల్లు చెల్లించమని అడిగినందుకు రెస్టారెంట్ ఉద్యోగిపై దాడి చేసారు. ఈ ఘటన రెస్టారెంట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వడంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి నోయిడా సెక్టార్ 29లోని కుక్ డు కు రెస్టారెంట్‌కు గౌరవ్ యాదవ్, హిమాన్షు, మరో ఇద్దరు వ్యక్తులు వెళ్లారని పోలీసు అధికారి తెలిపారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు రూ.650 బిల్లు కట్టకుండా బయటికి వెళ్లారు. 
 
అయితే బిల్లు పే చేయండని హోటల్  సిబ్బందిలో ఒకరైన షహబుద్దీన్ అభ్యర్థించాడు. దీంతో ఆగ్రహించిన వ్యక్తులు షహబుద్దీన్‌ను దుర్భాషలాడడం ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలో ఒకరు రెస్టారెంట్ ఉద్యోగిని నేలపై పడేలా బలంగా వారు తన్నడం రికార్డ్ అయ్యింది. 
 
అతను లేచి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అతనిని మందు తాగిన వ్యక్తులు చెంపదెబ్బ కొట్టారు. ఈ దాడికి సంబంధించి పోలీసులకు షహబుద్దీన్‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments