Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా రిజర్వేషన్‌లకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : కేంద్ర మంత్రి వెంకయ్య

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (15:17 IST)
దేశ వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని, ఈ దిశగా ఏ6కాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగాలని ఆయన ఆకాంక్షించారు. కీలక బిల్లులు ఆమోదం పొందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. 
 
మహిళా రిజర్వేషన్లపై ఆయన స్పందిస్తూ.. మహిళా రిజర్వేషన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, అయితే పార్లమెంట్‌, శాసనసభల్లో మాత్రం ఏకాభిప్రాయం కుదరడం లేదన్నారు. ముందు అందరూ సరే అంటున్నారని, తర్వాత అడ్డుపడుతున్నారని, ఈ విషయమై అందరితో చర్చలు జరుపుతున్నామన్నారు. 
 
రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్ రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతోందన్నారు. దేశం మొత్తం రిజర్వేషన్‌ అమలు కావాలని ఆకాంక్షిస్తున్నామని, ఇందుకోసం ఏకాభిప్రాయం రావాలని ఆశిస్తున్నట్లు కోరారు. వచ్చే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో జీఎస్టీ సహా అన్ని బిల్లులు ఆమోదం పొందుతాయని వెంకయ్యనాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments