Webdunia - Bharat's app for daily news and videos

Install App

కావేరీ జలాల వివాదంపై ప్రధాని మోడీ, వెంకయ్య ఏమన్నారో తెలుసా?

కావేరి జలాల వివాదంపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నోరువిప్పారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య తరచూ కావేరీ నీటి వివాదం ఇబ్బందిగా మారిందని వెంకయ్య వ్యాఖ్యానించారు. కానీ ఆందోళనల పేరిట ఆస్తులను ధ్వంసం చ

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (11:31 IST)
కావేరి జలాల వివాదంపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నోరువిప్పారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య తరచూ కావేరీ నీటి వివాదం ఇబ్బందిగా మారిందని వెంకయ్య వ్యాఖ్యానించారు. కానీ ఆందోళనల పేరిట ఆస్తులను ధ్వంసం చేయడం మంచిదికాదని వెంకయ్య హితవు పలికారు. ఆందోళనల పేరిట చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని వెల్లడించారు. ఆందోళనలతో సమస్య పరిష్కారం కాదని, సామరస్యపూర్వక చర్చలు అవసరమన్నారు. 
 
కాగా కావేరీ జలాల వివాదం మంగళవారం కర్ణాటక, తమిళనాడుల్లో భారీ విధ్వంసానికి దారితీసింది. రెండు రాష్ట్రాల్లో ఆందోళనకారులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. బెంగళూరు కెంగేరిలోని ద్వారకనాథ్‌ నగర వద్ద ఒకే ఆవరణలో నిలిపి ఉంచిన తమిళనాడు ప్రైవేటు రవాణా సంస్థ కేపీఎన్‌కు చెందిన 30, మరో సంస్థకు చెందిన 2 బస్సుల్ని దుండగులు తగులబెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 లారీలను ధ్వంసం చేశారు.
 
బెంగళూరులో ఆందోళనకారులపై భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా ఇద్దరికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. మరోవైపు తమిళనాడులో రాజధాని చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌పై కర్ణాటక తీరుకు నిరసనగా ఆందోళనకారులు పెట్రోలు బాంబుతో దాడి చేశారు.
 
మరోవైపు కావేరి నదీ జలాల వివాదంపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం స్పందించారు. ఇరురాష్ట్రాల ప్రజలు సంయమనం పాటించాలని, సామాజిక బాధ్యతలను గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో సమస్యలకు పరిష్కారం చర్చల ద్వారా మాత్రమే సాధ్యపడతాయని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments