Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభలో కంటతడి పెట్టిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..

Webdunia
సోమవారం, 29 జులై 2019 (19:45 IST)
సోమవారం రాజ్యసభలో దివంగత నేత జైపాల్‌రెడ్డికి నివాళులు అర్పిస్తూ జైపాల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. జైపాల్ రెడ్డి గొప్ప ఆదర్శవంతమైన నేత అని మంచి పాలనాదక్షుడని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కిందని చెపుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు వెంకయ్యనాయుడు. 
 
నాడు అసెంబ్లీ 8 గంటలకు ప్రారంభమైతే మేమిద్దరం 7 గంటలకే అసెంబ్లీకి చేరుకుని వివిధ అంశాలపై చర్చించుకునేవాళ్లం అని గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అవర్‌లో తరచు కలుసుకునేవారమని ఆ రోజులను గుర్తుచేసుకున్నారు వెంకయ్యనాయుడు. ఇద్దరం వేరు వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహించినా ప్రజాసమస్యలపై ఎవరి పంధాలో వారు వాదన చేసే వాళ్లం' అని జైపాల్‌ రెడ్డితో 40 ఏళ్లుగా తనకున్న అనుబంధాన్ని వెంకయ్యనాయుడు సభ్యులకు వివరించారు.
 
జైపాల్‌ రెడ్డికి విషయ పరిజ్ఞానం ఎక్కువని, ఏ అంశం మీద చర్చ జరిగినా లోతైన అవగాహనతో మాట్లాడేవారని, తెలుగు, ఇంగ్లీషు, హిందీ... ఇలా వివిధ భాషల్లో మంచి పట్టు ఉన్న ఉత్తమ పార్లమెంటేరియన్ అని కొనియాడారు. జైపాల్ ఇక లేరన్న సమాచారం తనను తీవ్రంగా బాధించిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments