Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభలో కంటతడి పెట్టిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..

Webdunia
సోమవారం, 29 జులై 2019 (19:45 IST)
సోమవారం రాజ్యసభలో దివంగత నేత జైపాల్‌రెడ్డికి నివాళులు అర్పిస్తూ జైపాల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. జైపాల్ రెడ్డి గొప్ప ఆదర్శవంతమైన నేత అని మంచి పాలనాదక్షుడని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కిందని చెపుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు వెంకయ్యనాయుడు. 
 
నాడు అసెంబ్లీ 8 గంటలకు ప్రారంభమైతే మేమిద్దరం 7 గంటలకే అసెంబ్లీకి చేరుకుని వివిధ అంశాలపై చర్చించుకునేవాళ్లం అని గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అవర్‌లో తరచు కలుసుకునేవారమని ఆ రోజులను గుర్తుచేసుకున్నారు వెంకయ్యనాయుడు. ఇద్దరం వేరు వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహించినా ప్రజాసమస్యలపై ఎవరి పంధాలో వారు వాదన చేసే వాళ్లం' అని జైపాల్‌ రెడ్డితో 40 ఏళ్లుగా తనకున్న అనుబంధాన్ని వెంకయ్యనాయుడు సభ్యులకు వివరించారు.
 
జైపాల్‌ రెడ్డికి విషయ పరిజ్ఞానం ఎక్కువని, ఏ అంశం మీద చర్చ జరిగినా లోతైన అవగాహనతో మాట్లాడేవారని, తెలుగు, ఇంగ్లీషు, హిందీ... ఇలా వివిధ భాషల్లో మంచి పట్టు ఉన్న ఉత్తమ పార్లమెంటేరియన్ అని కొనియాడారు. జైపాల్ ఇక లేరన్న సమాచారం తనను తీవ్రంగా బాధించిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments