Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభలో కంటతడి పెట్టిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..

Webdunia
సోమవారం, 29 జులై 2019 (19:45 IST)
సోమవారం రాజ్యసభలో దివంగత నేత జైపాల్‌రెడ్డికి నివాళులు అర్పిస్తూ జైపాల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. జైపాల్ రెడ్డి గొప్ప ఆదర్శవంతమైన నేత అని మంచి పాలనాదక్షుడని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కిందని చెపుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు వెంకయ్యనాయుడు. 
 
నాడు అసెంబ్లీ 8 గంటలకు ప్రారంభమైతే మేమిద్దరం 7 గంటలకే అసెంబ్లీకి చేరుకుని వివిధ అంశాలపై చర్చించుకునేవాళ్లం అని గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అవర్‌లో తరచు కలుసుకునేవారమని ఆ రోజులను గుర్తుచేసుకున్నారు వెంకయ్యనాయుడు. ఇద్దరం వేరు వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహించినా ప్రజాసమస్యలపై ఎవరి పంధాలో వారు వాదన చేసే వాళ్లం' అని జైపాల్‌ రెడ్డితో 40 ఏళ్లుగా తనకున్న అనుబంధాన్ని వెంకయ్యనాయుడు సభ్యులకు వివరించారు.
 
జైపాల్‌ రెడ్డికి విషయ పరిజ్ఞానం ఎక్కువని, ఏ అంశం మీద చర్చ జరిగినా లోతైన అవగాహనతో మాట్లాడేవారని, తెలుగు, ఇంగ్లీషు, హిందీ... ఇలా వివిధ భాషల్లో మంచి పట్టు ఉన్న ఉత్తమ పార్లమెంటేరియన్ అని కొనియాడారు. జైపాల్ ఇక లేరన్న సమాచారం తనను తీవ్రంగా బాధించిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments