Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రుల కోసం తనను అమ్మకానికి పెట్టుకున్న వడోదర మహిళ!

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (17:24 IST)
వడోదరకు చెందిన ఓ మహిళ తనను తాను అమ్మకానికి పెట్టుకుంది. దీనికి కారణం కటిక దరిద్ర్యం. ఈ దరిద్ర్యం కొందరిలో పట్టుదల పెంచి ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తే.. మరికొందరిని దుశ్చర్యలవైపు తీసుకెళుతోంది. 
 
20 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి వడోదరకు చాందిని రాజ్‌గౌర్ అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి వడోదరకు చేరుకుంది. ఈమె తన ఫేస్ బుక్ ఖాతాలో తన ఫొటో అప్‌లోడ్ చేసి, దానికింద ఓ సందేశం ఉంచింది. తల్లిదండ్రులకు వైద్య చికిత్స చేయించేందుకు అవసరమైన డబ్బు కోసం తనను తాను అమ్ముకుంటున్నానని ఆ సందేశంలో పేర్కొంది. 
 
తల్లిదండ్రులు మంచాన పడడంతో వారి ఆలనాపాలన అంతా చాందినీయే కొన్నేళ్లుగా చూసుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న ఓ జాతీయ మీడియా ఆమెను సంప్రదించగా, తనను తాను అమ్ముకోవడం తప్ప తనకు మరోమార్గం కనిపించలేదని, అందుకే అమ్మకానికి పెట్టుకున్నట్టు తెలిపింది. 
 
అంతేకాకుండా, వైద్య ఖర్చుల కోసం "నా తల్లిదండ్రుల కోసం నన్ను కొనండి" అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. తమ ఇక్కట్లు తీరాలంటే తాను అమ్ముడవడం తప్ప మరోమార్గం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments