Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ చేసినవాడితోనే పెళ్లి... రూ.5 లక్షల కట్నం డిమాండ్...

ఉత్తరాదిన... అదీ ఉత్తరప్రదేశ్ అంటేనే అత్యాచారాలకు నెలవైన రాష్ట్రంగా మారిపోతోంది. అమ్మాయిలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారం చేసిన వాడిని కఠినంగా శిక్షించాలంటూ ప్రభుత్వాలు నిర్భయ చట్టాలు తెచ్చినా అవి అమలుకు నోచుకుంటున్న దాఖలాలు వుండటంలేదు.

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (21:06 IST)
ఉత్తరాదిన... అదీ ఉత్తరప్రదేశ్ అంటేనే అత్యాచారాలకు నెలవైన రాష్ట్రంగా మారిపోతోంది. అమ్మాయిలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారం చేసిన వాడిని కఠినంగా శిక్షించాలంటూ ప్రభుత్వాలు నిర్భయ చట్టాలు తెచ్చినా అవి అమలుకు నోచుకుంటున్న దాఖలాలు వుండటంలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ తనకు కట్నంగా రూ.5 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ పెట్టాడు. 
 
వివరాల్లోకి వెళితే... ఉత్తర్‌ప్రదేశ్‌లోని బండా గ్రామానికి చెందిన తాజ్‌ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిపై అత్యాచారం చేశాడు. దాంతో తమ కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని ఆమె తల్లిదండ్రులు ఊరి పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పెద్దలు ఓ పంచాయతీ చేశారు. అదేమిటంటే... అత్యాచారం చేసిన దానికి కేసులేమీ పెట్టబోమనీ, ఐతే ఆమెను వివాహం చేసుకోవాలని సూచన చేశారు.
 
పెద్దల ముందు సరేనని తలకాయను ఆడించిన తాజ్.. పెళ్లి రోజు దగ్గరపడేసరికి తన నిజరూపం మరోసారి బయటపెట్టాడు. తనకు రూ. 5 లక్షలు కట్నంగా ఇస్తేనే అమ్మాయి మెడలో తాళి కడతానంటూ కండిషన్ పెట్టాడు. దాంతో చేసేది లేక బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments