Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టులో బాంబులు విసిరిన లాయర్.. బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (12:31 IST)
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో ఓ లాయర్ క్రూడ్ బాంబులతో తోటి లాయర్లపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక లాయర్‌కి తీవ్ర గాయాలవగా, మరో ఇద్దరు స్వల్ప గాయాల పాలయ్యారు. రెండు లాయర్ల గ్రూపుల మధ్య వివాదం కారణంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
 
 గురువారం మధ్యాహ్నం లక్నో కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఓ కోర్టులోని బార్ అసోసియేషన్ సెక్రెటరీ సంజీవ్ లోధీ ఆఫీసులో మరో లాయర్ క్రూడ్ బాంబులు విసిరేశాడు. 
 
మూడు నాలుగు బాంబులు విసరగా.. వాటిలో ఒకటి పేలింది. దీంతో అక్కడ ఉన్న సంజీవ్ లోధీ, మరో లాయర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. అయితే లోధీని కలిసేందుకు వచ్చిన ఓ లాయర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. 
 
పేలకుండా ఉన్న మూడు బాంబులను గుర్తించారు. వాటిని జాగ్రత్తగా డిస్పోజ్ చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments