Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త కళ్లెదుటే 30 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్... బైకుపై వెళుతుంటే...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో 30 ఏళ్ల మహిళపై ఆమె కట్టుకున్న భర్త ఎదుటే నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... తమ బిడ్డకు ఆరోగ్యాన్ని చె

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (10:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో 30 ఏళ్ల మహిళపై ఆమె కట్టుకున్న భర్త ఎదుటే నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... తమ బిడ్డకు ఆరోగ్యాన్ని చెక్ చేయించుకునేందుకు భార్యాభర్తలు ఇద్దరూ ఆసుపత్రికి వెళ్లి వస్తున్నారు. మార్గమధ్యంలో వారి బైకును నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. ఆ తర్వాత వారిని బైకు పైనుంచి కిందికి లాగి సమీపంలో వున్న చెరకు తోటలోకి తీసుకెళ్లారు. 
 
అక్కడ ఆమె భర్తను ఓ చెట్టుకు కట్టేశారు. ఆ తర్వాత మహిళపై అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. అలా అయితే పసిబిడ్డను చంపేస్తామని ఆమెను బెదిరించి బలవంతంగా ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఘటనా ప్రదేశంలో పసిబిడ్డ ఏడుపులు, మహిళ అరుపులను సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న రైతులు విని పరుగు పరుగున వచ్చారు. కానీ అప్పటికే ఆ నలుగురు కామాంధులు పరారయ్యారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం