Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు - 39 మందికి గాయాలు

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (18:31 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 39 మంది గాయపడ్డారు. అయితే, క్షతగాత్రులను రక్షించడంలో తీవ్ర జాప్యం జరుపుతోంది. దీనికి కారణం ప్రమాదం జరిగిన ప్రాంతంలో వర్షం కురుస్తోంది. బస్సు అతివేగం కారణంగా నియంత్రణ కోల్పోయి ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. 
 
బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అందులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు మరో 31 మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 
 
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ముస్సోరి పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. బస్సులో నుంచి క్షతగాత్రులను వెలికి తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

ఈ పనికిమాలిన వార్త ఎందుకురా?: అనుష్క శెట్టి పెళ్లివార్తపై ఓ నెటిజన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

తర్వాతి కథనం
Show comments