Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌‍లో విద్యుత్ షాక్‌కు 15 మంది మృత్యువాత

Webdunia
బుధవారం, 19 జులై 2023 (19:56 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. కరెంట్ షాక్ తగిలి 15 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. మృత్తుల్లో ముగ్గురు పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు హోం గార్డులు కూడా ఉన్నారు. చమోలీ జిల్లా అలకనందా నది ఒడ్డున నమామి గంగే ప్రాజెక్టు స్థలం వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఓ పంపింగ్ స్టేషన్‌ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవడంతో పక్కనే ఉన్న ఇనుప రైలింగ్‌కు విద్యుత్ సరఫరా అయింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలిసిన వెంటనే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ అదనపు డీజీపీ వి.మురుగేశన్ మాట్లాడుతూ, మంగళవారం రాత్రి ఓ వ్యక్తి ప్రమాదవశాస్తు మరణించాడు. దీంతో బుధవారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు.. వైద్యుల సాయంతో అక్కడే పంచనామా చేపట్టారు. ఆ సమయంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయింది. దీంతో ఇనుప రెయిలింగ్‌కు విద్యుత్ సరఫరా కావడంతో ఇలా జరిగినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని, దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలుస్తాయని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments