Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంజాయ్ చేద్దాం రా.. అంటూ ప్రియుడిని పిలిచి కిరాతకంగా చంపేసిన ప్రియురాలు...

తన నగ్న ఫోటోలను ఇంటర్నెట్‌లో పెడతానన్న ప్రియుడుని ఓ ప్రియురాలు అత్యంత కిరాతకంగా హత్యచేసింది. హోటల్‌లో గదిని అద్దెకు తీసుకుని ఎంజాయ్ చేద్దాం రా అంటూ పిలిచి చంపేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని

Webdunia
ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (13:56 IST)
తన నగ్న ఫోటోలను ఇంటర్నెట్‌లో పెడతానన్న ప్రియుడుని ఓ ప్రియురాలు అత్యంత కిరాతకంగా హత్యచేసింది. హోటల్‌లో గదిని అద్దెకు తీసుకుని ఎంజాయ్ చేద్దాం రా అంటూ పిలిచి చంపేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మధుర నగరానికి చెందిన సుశీల్‌ కుమార్‌ (23), డాలీ చౌదరీ (20) అనే యువతీయువకులు కొంతకాలం పాటు ప్రేమించుకుని, సహజీవనం చేశారు కూడా. ఆ తర్వాత తనకు నొయిడాలో ఉద్యోగం ఇప్పించిన మోహిత్‌ మావి అనే వ్యక్తితో డాలీకి స్నేహం ఏర్పడింది. దీన్ని సుశీల్ జీర్ణించుకోలేక పోయాడు. తన ప్రియురాలిపై పగ పెంచుకుని బెదిరింపులకు దిగాడు. మళ్లీ తనతో కలిసి ఉండాలనీ, లేదంటే తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు దిగిన ప్రైవేటు ఫొటోలను ఇంటర్నెట్‌లో పెట్టి పరువు తీస్తానని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. 
 
మాజీ ప్రియుడి వ్యవహారంతో ఆందోళనకుగురైన డాలీ అతన్ని అంతమొందించాలని భావించింది. తను పెళ్లిచేసుకోబోతున్న మనీష్‌ చౌదరీతో  పథకం రచించింది. ఓ హోటల్‌లో ఆగస్టు 11న డాలీ సుశీల్‌ కలుసుకున్నారు. అక్కడ ఎలాంటి అనుమానంరాకుండా వ్యవహరించిన డాలీ సుశీల్‌ను నమ్మించింది. నిద్రమాత్రలు కలిపిన కూల్‌డ్రింక్‌ని అతడి చేత తాగించింది. 
 
మనీష్‌ ప్రాణాలు విడిచిన అనంతరం మృతదేహాన్ని కాబోయే భర్త మనీష్‌తో కలిసి యమునా నదిలో పడేసింది. ఆ తర్వాత తన కుమారుడు కనిపించలేదంటూ సుశీల్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ జరుపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో డాలీతో పాటు.. మోహిత్‌లను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments