Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి

ఠాగూర్
శుక్రవారం, 4 అక్టోబరు 2024 (08:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. కూలీలతో వారణాసి వెళుతున్న ట్రాక్టర్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన యూపీలోని మీర్జాపూర్ వద్ద సంభవించింది. కచ్వా సరిహద్దు జిల్ రోడ్డులో అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ట్రక్ అదుపుతప్పి కూలీలతో వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడి బనారస్ హిందూ యూనివర్శిటీ ట్రామా సెంటర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కూలీలు భదోహా జిల్లాలో పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ ఘోరం జరిగిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments