Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగి సర్కారు ఉక్కుపాదం.. 2వారాల్లో 64,128 లౌడ్ స్పీకర్ల తొలగింపు

Webdunia
సోమవారం, 9 మే 2022 (16:22 IST)
యోగి ఆదిత్యనాథ్ సర్కారు లౌడ్ స్పీకర్లపై ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 
 
రెండు వారాల్లోనే భిన్న మత వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలాల నుంచి అనుమతుల్లేని 64,128 లౌడ్ స్పీకర్లను తొలగించారు. అదే సమయంలో 57,352 లౌడ్ స్పీకర్ల వ్యాల్యూమ్‌ను తగ్గించారు. 
 
లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసిన చోట.. వాటి నుంచి వచ్చే శబ్దం అక్కడి ఆవరణ దాటి వినపడకూడదంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 
 
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగానే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్టు ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అనధికారికంగా నడుస్తున్న లౌడ్ స్పీకర్లను తొలగించేంత వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు. 
 
అత్యధికంగా బరేలీ ప్రాంతం నుంచి 17,287 లౌడ్ స్పీకర్లు తొలగించారు. ఆ తర్వాత మీరట్ నుంచి 11,769 లౌడ్ స్పీకర్లను స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments