Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ మొరదాబాద్‌లో అగ్నిప్రమాదం - నలుగురి సజీవదహనం

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (13:34 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరదాబాద్‌లోని గల్‌షహీద్ ప్రాంతంలోని ఓ మూడు అంతస్తుల భవనంలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. 
 
ఈ భవనం యజమాని ఇంటిలోని మూడో అంతస్తులో నివసిస్తున్నాడు. కింది ఇంటిలో స్క్రాప్ మెటీరియల్ ఉంది. వీటికి నిప్పు అంటుకుని పై అంతస్తుకు కూడా పాకాయి. దీంతో మూడో అంతస్తులోని వారు కిందికి రాలేకపోయారు. పైగా, వారిని రక్షించేందుకు అగ్నిమాపకదళ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సివచ్చింది. 
 
ఈ ప్రమాదంపై మొరాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు శైలేంద్ర సింగ్, సీనియర్ పోలీస్ అధికారి హేమంత్ కుటియాల్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదం వెనుకగల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, ఈ భవనంలో ఓ పెళ్లి వేడుక జరుగుతుంది. దీంతో అనేక మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపకదళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం 12 మందిని రక్షించారు. వారిలో ఐదుగురుతీవ్రంగా గాయపడి నలుగురు అక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments