Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు దెయ్యం పట్టిందనీ... శోభనం రాత్రి నవవధువుపై తాంత్రికుడు.. మరిది అత్యాచారం

కోటి ఆశలతో కొన్ని గంటల క్రితం మెట్టినింట్లో అడుగుపెట్టిన నవ వధువు తన భర్త తమ్ముడు (మరిది) చేతిలోనే అత్యాచారనికి గురైంది. నీ భర్తకు దెయ్యం పట్టింది.. అతనితో సంభోగంలో పాల్గొంటే చనిపోతావని బెదిరించి తాంత

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (13:31 IST)
కోటి ఆశలతో కొన్ని గంటల క్రితం మెట్టినింట్లో అడుగుపెట్టిన నవ వధువు తన భర్త తమ్ముడు (మరిది) చేతిలోనే అత్యాచారనికి గురైంది. నీ భర్తకు దెయ్యం పట్టింది.. అతనితో సంభోగంలో పాల్గొంటే చనిపోతావని బెదిరించి తాంత్రికుడితో కలిసి మరిది ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మీరట్ సమీపంలోని లిసారీ గేట్ ప్రాంతానికి చెందిన బాధితురాలికి హార్పూర్ జిల్లాలో వస్త్ర వ్యాపారితో ఈనెల 15వ తేదీన వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అంటే శోభనానికి వెళ్లే ముందు ఆమెకు స్వల్పంగా మత్తుమందు కలిపిన పానీయాన్ని తాగించారు. 
 
ఆ తర్వాత శోభనం గదిలోకి మరిది, తాంత్రికుడు వచ్చి.. నీ భర్తకు దెయ్యం పట్టిందని, అతను చనిపోకుండా చూడాలని, ఇందుకోసం అతనితో సంభోగంలో పాల్గొనకుండా మరిదితో శోభనం చేయాలని, అప్పుడే భర్త బతుకుతాడని చెప్పి... మరిదితో కలసి తాంత్రికుడు కూడా అత్యాచారం చేశాడు. 
 
మరుసటి రోజు ఉదయం తెలివిలోకి వచ్చిన ఆమె, తల్లికి విషయం తెలిపింది. ఇది జరిగిన వారం రోజుల తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించగా, మీరట్ పోలీసులు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments