మోడీ - షాలకు ముచ్చెమటలు : యూపీలో 57 మంది సిట్టింగ్‌లకు నో ఛాన్స్

Webdunia
మంగళవారం, 15 జనవరి 2019 (11:15 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పీ - బీఎస్పీ పార్టీల మధ్య కుదిరిన పొత్తు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలకు ముచ్చెమటలు పోయిస్తోంది. ముఖ్యంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 57 మంది సిట్టింగ్‌ల స్థానంలో కొత్తవారిని బరిలోకి దించాలని భావిస్తున్నారు. ఈ 57 స్థానాల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 
 
యూపీలో అధికార బీజేపీకి వ్యతిరేకంగా కొత్తగా ఎస్పీ, బీఎస్పీ కూటమి ఏర్పాటైంది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి కూడా చోటులేదు. ఇది బీజేపీకి షాక్ కలిగించింది. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్గత సర్వేలో 57 మంది సిట్టింగ్‌ ఎంపీలకు వ్యతిరేకంగా రిపోర్టులు వచ్చినట్టు సమాచారం. కేంద్రం అమలుచేస్తున్న పథకాలపై కిందిస్థాయిలో అవగాహన కల్గించాలన్న బీజేపీ చీఫ్‌‌‌‌ అమిత్‌‌‌‌ షా టార్గెట్‌‌‌ను చేరుకోవడంలో ఈ సిట్టింగ్‌ ఎంపీలు విఫలమైనట్టు చెబుతున్నారు. 
 
ఈ నెల 9వ తేదీన జరిగిన సమావేశంలో ఈ ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడంలేదని అమిత్‌‌‌‌షా స్వయంగా చెప్పారని మీడియా కథనాలు వచ్చాయి . ఎస్పీ- బీఎస్పీ కూటమిలో సామాజికంగా అన్ని వర్గాల వారికి టికెట్లు ఇచ్చే అవకాశముంటుందని భావించిన బీజేపీ.. ఆ దిశగా ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత నుంచి బయటపడేందుకు కొత్తవారిని బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments