Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషికి పంది మూత్రపిండం అమర్చిన వైద్యులు... ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 22 మార్చి 2024 (10:08 IST)
ఇటీవలికాలంలో శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. జంతువుల అంతర్గత అవయవాలను మనుషులకు అమర్చుతున్నారు. మానవుల ప్రాణాలను రక్షించే క్రమంలో ఇలాంటి కొత్తకొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇటీవల పందె గుండెను ఓ మానవుడికి అమర్చారు. ఇపుడు పందె మూత్ర పిండాన్ని మనిషికి అమర్చారు. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్ర పిండాన్ని 62 యేళ్ళ ఓ రోగికి అమర్చారు. జీవించివున్న వ్యక్తికి వరాహ కిడ్నీని అమర్చడం ఇదే తొలిసారని అమెరికాలోని మసాచుసెట్స్‌ జనరల్ ఆస్పత్రి వైద్యులు గురువారం తెలిపారు. 
 
ఈ నెలలో సంబంధిత ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశామని, అవయవ గ్రహీత బాగానే కోలుకుంటున్నారని వెల్లడించారు. త్వరలోనే డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గతంలో పంది మూత్రపిండాలను జీవన్మృతుల్లోకి తాత్కాలికంగా మార్పిడి చేసిన దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు. వరాహాల గుండెలను ఇద్దరికి అమర్చినప్పటికీ వారిద్దరూ కొన్ని నెలల్లోనే మరణించారని వారు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments