Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోకి నిచ్చెనెక్కి 'గీత' దాటిన ఉగ్రవాదులు...

గత నెలలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ సెక్టార్‌లో ఉన్న భారత ఆర్మీ క్యాంపుపై తీవ్రవాదులు దాడిచేసి 18 మంది సైనికులను హతమార్చిన విషయం తెల్సిందే. ఈ దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశి

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (15:39 IST)
గత నెలలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ సెక్టార్‌లో ఉన్న భారత ఆర్మీ క్యాంపుపై తీవ్రవాదులు దాడిచేసి 18 మంది సైనికులను హతమార్చిన విషయం తెల్సిందే. ఈ దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించేందుకు సరికొత్త టెక్నిక్‌ను ఉపయోగించారు. కేవలం రెండు నిచ్చెనల సాయంతో వీరు భారత భూభాగంలోకి అడుగుపెట్టారు. 
 
ముందుగా ఒక ఉగ్రవాది ఒక నిచ్చెనను తీసుకుని.. సలామాబాద్‌ నల్లా ప్రాంతం వద్ద నియంత్రణ రేఖ కంచెకు ఉన్న ఖాళీల గుండా భారతవైపు చొరబడ్డాడు. ఇటువైపు రాగానే ఆ నిచ్చెనను కంచెకు అమర్చాడు. భారీస్థాయిలో ఆయుధాలు, పెద్ద ఎత్తున ఆహారపదార్థాలు, ఇతర సామగ్రితో సిద్ధంగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు.. అటువైపు నుంచి మరో నిచ్చెనను భారత వైపున్న నిచ్చెనకు ఆనించి పెట్టారు. 
 
దీంతో అటు నుంచి నిచ్చెన ఇక్కి.. ఇటు వైపు నిచ్చెన మీదుగా భారతలో చొరబడి ఉరీలోకి అడుగుపెట్టారు. భారతవైపు వేసిన నిచ్చెనను.. తమతోపాటు నియంత్రణ రేఖ దాకా వచ్చిన ఇద్దరు గైడ్‌లు కబీర్‌ అవన్‌, బషరత్‌లకు ఇచ్చి పంపేశారు. యురీ ఉగ్రదాడిపై దర్యాప్తులో ఈ విషయాలు తెలిసినట్టు అధికార వర్గాల సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments