Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి ఝలక్ ఇచ్చిన ఉపేంద్ర : మంత్రి పదవికి గుడ్‌బై

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (15:02 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేంద్ర మంత్రి ఒకరు తేరుకోలేని షాకిచ్చారు. కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఉపేంద్ర కుష్వాహ్ తన పదవికి రాజీనామా చేశారు. 
 
ఈయన బీహార్ రాష్ట్రంలో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి చెందిన నేత. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీతో పాటు దానిమిత్రపక్ష పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతోంది. ఈ సీట్ల పంపణీ సరిగాలేదని పేర్కొంటూ ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా కేంద్ర మంత్రిపదవికి కూడా రాజీనామా చేశారు. 
 
బీహార్ రాష్ట్ర ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చామనీ, కానీ వాటిలో ఒక్కదాన్ని కూడా అమలుచేయలేకపోయమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే రాజీనామా చేస్తున్న‌ట్లు త‌న లేఖ‌లో తెలిపారు. ఆర్ఎల్ఎస్పీ పార్టీకి బీహార్ ఎంపీ సీట్ల‌లో కేవ‌లం రెండు సీట్లు మాత్ర‌మే కేటాయించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణ‌యించారు. దీంతో కేంద్ర‌మంత్రి ఉపేంద్ర ఎన్డీఏకు గుడ్‌బై చెప్పారు. అదేసమంయలో ఆయన సోమవారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి మంతనాలు జరిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments