ఆధార్‌లో ఉచిత మార్పులు - చేర్పులకు గడువు నేటితో పూర్తి

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (08:39 IST)
ఆధార్ కార్డులో దొర్లిన తప్పులకు ఉచితంగా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు నిర్ణయించిన గడువు జూన్ 14వ తేదీ బుధవారంతో ముగియనుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) నిబంధనల ప్రకారం ప్రతి పదేళ్లకోసారి ఆధార్ అప్‍డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే వెసులుబాటును ఉడాయ్ కల్పించింది. 
 
మై ఆధార్ పోర్టల్ ద్వారా ఈ సుదపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మార్చి 15వ తేదీ నుంచి ఇది అందుబాటులో ఉంది. అయితే, ఈ ఫ్రీ అప్‌‍డేట్ గడువు జూన్ 14వ తేదీతో ముగియనుంది. ఈ గడువు ముగిసిన తర్వాత వినియోగదారులు ఆధార్ అప్‌డేట్ కోసం రూ.50 రుసుం చెల్లించాల్సివుంటుంది. https://myaadhaar.uidai.gov.in పోర్టల్‌లోకి వెళ్ళి లాగిన్ కావడం ద్వారా రిజిస్టర్ మొబైల్ నంబర్ సాయంతో లాగిన్ కావాల్సి ఉంటుంది అయితే, మార్పులు, చేర్పులకు సంబంధించిన నిర్ధేశిత పత్రాలు జతచేయాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments