Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాపై అత్యాచారం జరిగింది.. ఇదిగోండి.. పిండం.. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా?

ఉత్తరప్రదేశ్‌లో ఓ అత్యాచార బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు తన ఐదు నెలల పిండాన్ని ఓ బ్యాగులో వేసుకొచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాను అత్యాచారానికి గురైయ్యానని.. నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవ

Webdunia
సోమవారం, 23 జులై 2018 (14:22 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఓ అత్యాచార బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు తన ఐదు నెలల పిండాన్ని ఓ బ్యాగులో వేసుకొచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాను అత్యాచారానికి గురైయ్యానని.. నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. గర్భస్రావం కావడంతో ఆ పిండాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే... యూపీ, అమ్రోహా జిల్లాకు చెందిన 19ఏళ్ల యువతిని మనోజ్ (22) అనే యువకుడు ఐదు నెలల క్రితం బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సాకుతో మళ్లీ మళ్లీ ఆ యువతిని లొంగదీసుకుని బెదిరించాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది. అయితే ఆమె కుటుంబీకులు యువతికి గర్భస్రావం చేయించారు. 
 
దీంతో ఆగ్రహానికి గురైన యువతి పోలీస్ స్టేషన్‌కు పిండంతో సహా వచ్చింది. తనపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని.. పిండమే ఇందుకు సాక్ష్యమని బ్యాగును చూపెట్టింది. దీంతో ఖంగుతిన్న పోలీసులు.. మనోజ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో వున్న మనోజ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments