Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరం రెండు ముక్కలైంది.. 14 గంటల తర్వాత ప్రాణం పోయింది..

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (13:53 IST)
రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి 14 గంటల పాటలు ప్రాణాలతో కొట్టుమిట్టాడాడు. చివరికి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఆత్మహత్య చేసుకోవాలని రైలు కింద పడ్డాడు. శరీరం రెండు ముక్కలైంది. అయినా 13 గంటల పాటు ప్రాణాలతో ఉన్నాడు. చివరకు ఆసుపత్రిలో మరణించాడు.

ఈ విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ షాజహాన్‌పుర్‌ జిల్లాలో జరిగింది. హతోడా గ్రామానికి చెందిన ఓ యువకుడు పక్కనే ఉన్న రైలు పట్టాల దగ్గరకు వెళ్లి అందరూ చూస్తుండగానే రైలు కింద పడ్డాడు.

అతని శరీరం రెండు ముక్కలై.. పైభాగం పక్కనే ఉన్న మురికి కాలువలో పడింది. అది చూసిన వాళ్లంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. దగ్గరికెళ్లి చూసి ఆ యువకుడిని హర్షవర్ధన్‌గా గుర్తించారు. అతడు చనిపోయాడేమో అని వారు భావించారు. అయితే హర్షవర్ధన్‌ వారితో మాట్లాడటంతో విస్తుపోయారు. 
 
ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు వారితో చెప్పాడు. ఒళ్లు గగుర్పొడిచే ఆ దృశ్యాన్ని కొంతమంది తమ చరవాణుల్లో రికార్డు చేశారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. హర్షవర్ధన్‌ను ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన 13 గంటల తర్వాత ఆ యువకుడు మరణించినట్లు చికిత్స అందించిన వైద్యురాలు పూజా పాండే తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments