Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరదలిని కిడ్నాప్ చేసి మత్తిచ్చి అత్యాచారం చేసిన బావ

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (14:53 IST)
యూపీ రాజధాని లక్నోలో మరో దారుణం జరిగింది. మరదిలిని కిడ్నాప్ చేసిన ఓ కామాంధుడు ఆమెకు మత్తుమందిచ్చి రెండు నెలలుగా అత్యాచారానికి తెగబడుతూ వచ్చాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మీరట్ జిల్లాలోని హ‌పూర్‌కు చెందిన నిందితుడికి ఆరేండ్ల కింద‌ట మీర‌ట్‌లోని లిసారి గేట్ ప్రాంతానికి చెందిన మ‌హిళ‌తో వివాహం జ‌రిగింది. కొన్నేండ్ల కింద‌ట ఇరువురి మ‌ధ్య విభేదాలు రావ‌డంతో కొంత‌కాలంగా నిందితుడి భార్య పుట్టింట్లోనే ఉంటోంది. రెండు నెల‌ల కింద‌ట మ‌హిళ చెల్లెలు క‌నిపించ‌క‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇక‌ నిందితుడి చెర నుంచి త‌ప్పించుకుని ఇంటికి చేరుకుంది. తాను ప‌నిమీద బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో త‌న బావ మాయమాట‌లు చెప్పి తనను తీసుకువెళ్లాడ‌ని, మ‌త్తుమందు క‌లిపిన ఇంజ‌క్ష‌న్లు ఇచ్చి రెండు నెల‌లుగా లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని వివ‌రించింది. బాలిక‌ని వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించ‌గా ప‌రారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు ముమ్మ‌రం చేశారు. 

సంబంధిత వార్తలు

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం