Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజాతీర్పుతో విపక్షాల నోటికి తాళం : యోగి ఆదిత్యనాథ్

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (19:47 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో విపక్షాల నోటికి తాళం పడిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌తో పాటు మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 
 
ఈ ఫలితాల తర్వాత సీఎం యోగి స్పందించారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ అద్భుత విజయం సాధించిందన్నారు. ఈ ప్రజాతీర్పుతో విపక్షాల నోటికి తాళం పడిందన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ చేసిన అసత్య ప్రచారానికి ఓటర్లు విస్పష్ట తీర్పును ఇచ్చారన్నారు. బీజేపీకి ఘన విజయం కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు. ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో యూపీ మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. 
 
కాగా ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయభేరీ మోగించింది. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి రానుంది. అలాగే, యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏడు దశల్లో జరిగిన యూపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం చేపట్టిన విషయం తెల్సిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments