Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంటరాని ప్రేమ : దళితుడిని పెళ్లి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కుమార్తెపై లాయర్ల దాడి

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (13:06 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొత్త దంపతులపై ఆ రాష్ట్ర న్యాయవాదులు దాడిచేశారు. దళిత యువకుడుని పెళ్లి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కుమార్తెపై లాయర్లు దాడి చేశారు. ఈ మేరకు బాధితులు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కుమార్తె సాక్షి మిశ్రా ఓ దళిత యువకుడిని వివాహం చేసుకుంది.
 
ప్రేమ వివాహం చేసుకున్న సాక్షి మిశ్రా, ఆమె భర్త అజితేశ్ కుమార్ తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సోమవారం ఉదయం అలహాబాద్ హైకోర్టులో హాజరయ్యారు. కోర్టు విచారణ పూర్తయి, బయటకు వస్తున్న ఈ జంటపై కొందరు న్యాయవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే ఆ దాడుల నుంచి ఈ దంపతులను అక్కడే ఉన్న మరికొందరు లాయర్లు కాపాడారు. 
 
సాక్షి మిశ్రా, అజితేశ్ కుమార్‌కు రక్షణ కల్పించాలని జస్టిస్ సిద్దార్థ వర్మ ఆదేశించిన కొద్దిసేపట్లోనే ఈ దాడి జరుగడం గమనార్హం. జరిగిన ఘటనపై సాక్షి దంపతులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, వాళ్లపై దాడి జరిగినట్టు మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని కంటోన్మెంట్ పోలీసు అధికారి ఏ కే గౌతమ్ తెలిపారు.
 
ఈ వ్యవహారంలో కిడ్నాప్‌కి గురైన వాళ్లు సాక్షి, అజితేశ్ అన్న వదంతులు వ్యాపించాయని చెప్పారు. పెళ్లి చేసుకున్న అనంతరం తన తండ్రి నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ సాక్షి మిశ్రా ఇటీవల ఓ వీడియోలో పేర్కొన్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments