Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవు దూడను కాపాడబోయి... యూపీలో విషాదం

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (09:15 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. బావిలోపడిన ఓ ఆవుదూడను రక్షించబోయిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఈ మృతివార్త తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని గోండా జిల్లాలోని రాజా మొహల్లాలో ఓ పాడు బావిలో ఓ ఆవుదూడ పడిపోయింది. దీనిని రక్షించే క్రమంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బావి పాడుబడటంతో గ్రామస్థులు దాంట్లో చెత్త వేసేవారు. 
 
ఈ బావిలో మంగళవారం ఓ లేగదూడ పడిపోయింది. గమనించిన ఓ వ్యక్తి దానిని రక్షించేందుకు నిచ్చెన వేసుకుని బావిలోకి దిగాడు. కిందికి దిగిన వ్యక్తి బావిలో వెలువడిన విషవాయువు పీల్చి స్పృహ కోల్పోయాడు. దీంతో ఆయనను బయటకు తీసుకొచ్చేందుకు అందులో దిగిన మరో నలుగురు కూడా విషవాయువుల కారణంగా స్పృహతప్పిపోయారు.
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక, మునిసిపాలిటీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments