Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకు నుంచి రూ.10నోట్లను దోచేశారు.. ఏకంగా కారునే కొనేశారు.. ఆపై...?

బ్యాంకు నుంచి రూ.10 నోట్లను దొంగలించారు. దొంగలించిన డబ్బుతో ఏకంగా కారునే కొనేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సహరాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళిత

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2016 (17:31 IST)
బ్యాంకు నుంచి రూ.10 నోట్లను దొంగలించారు. దొంగలించిన డబ్బుతో ఏకంగా కారునే కొనేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సహరాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మలక్‌పూర్‌ హుస్సేన్‌ గ్రామానికి చెందిన నాసిర్, అఫ్జల్, రాకేష్, టినులు స్నేహితులు. ఈ నలుగురు యువకులు రాత్రికి రాత్రే ఓ కారునే కొనేశారు. దీంతో గ్రామస్తులంతా షాక్ అయ్యారు. 
 
అంతేగాకుండా పోలీసులకు సమాచారం అందించారు. ఇందులో పోలీసులు నాసిర్ అనే యువకుడిని అరెస్టు చేశారు. ఓ వైపు నగదు కొరతతో గ్రామస్తులు ఇబ్బంది పడుతుంటే వీరు జల్సా చేయడం, రాత్రికి రాత్రే కారు కొనడం వెనుక గల కారణాలను పోలీసులు ఆరా తీశారు. వీరికి వచ్చిన డబ్బంతా బ్యాంకు నుంచి దోచుకున్నది తెలుసుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇంకా గత నెల 19న మొత్తం పది లక్షల రూపాయలు దొంగతనానికి గురైందని తెలుసుకున్నారు. అందులో 5 లక్షలు రూ.10 నోట్లు, మిగిలిన 5 లక్షలు రూ.20 నోట్ల. దీనిపై కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు అరెస్టు చేసిన నాసిర్ వద్ద నుంచి రూ.50వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments