Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసింది బీజేపీ ఎమ్మెల్యే అయితే ప్రశ్నించొద్దు : రాహుల్

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (08:59 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచార ఘటనలో కీలక మలుపుతిరిగింది. ఈ కేసులో ప్రధాన ప్రధాన బాధితురాలు రోడ్డు ప్రమాదానికి గురికావడం ఇపుడు అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. 
 
ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉన్నావో అత్యాచార బాధితురాలు తీవ్రంగా గాయపడగా, ఆమెతో పాటు కారులో ప్రయాణిస్తున్న బంధువుల్లో మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై విపక్ష పార్టీల నేతలంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది రోడ్డు ప్రమాదం కాదనీ, ఖచ్చితంగా ఏదో కుట్ర దాగివుందని చెప్పారు.
 
అదేసమయంలో ఈ ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. "భారతీయ మహిళల కోసం ప్రత్యేక ఎడ్యుకేషన్ బులిటెన్. మీపై అత్యాచారం చేసిన నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే అయితే ప్రశ్నించొద్దు" అని ట్వీట్ చేశారు. 
 
అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన 'బేటీ పడావో.. బేటీ బచావో' పథకాన్ని ప్రశ్నించారు. అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు మాత్రం ఈ ఘటనపై స్పందించారు. అది రోడ్డు ప్రమాదమేనని, ఈ ప్రమాదంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని యూపీ పోలీసులు స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments