Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసింది బీజేపీ ఎమ్మెల్యే అయితే ప్రశ్నించొద్దు : రాహుల్

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (08:59 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచార ఘటనలో కీలక మలుపుతిరిగింది. ఈ కేసులో ప్రధాన ప్రధాన బాధితురాలు రోడ్డు ప్రమాదానికి గురికావడం ఇపుడు అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. 
 
ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉన్నావో అత్యాచార బాధితురాలు తీవ్రంగా గాయపడగా, ఆమెతో పాటు కారులో ప్రయాణిస్తున్న బంధువుల్లో మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై విపక్ష పార్టీల నేతలంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది రోడ్డు ప్రమాదం కాదనీ, ఖచ్చితంగా ఏదో కుట్ర దాగివుందని చెప్పారు.
 
అదేసమయంలో ఈ ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. "భారతీయ మహిళల కోసం ప్రత్యేక ఎడ్యుకేషన్ బులిటెన్. మీపై అత్యాచారం చేసిన నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే అయితే ప్రశ్నించొద్దు" అని ట్వీట్ చేశారు. 
 
అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన 'బేటీ పడావో.. బేటీ బచావో' పథకాన్ని ప్రశ్నించారు. అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు మాత్రం ఈ ఘటనపై స్పందించారు. అది రోడ్డు ప్రమాదమేనని, ఈ ప్రమాదంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని యూపీ పోలీసులు స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments