Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ పొడగింపు ఓ గేమ్ ఛేంజర్ మాత్రమే.... అసలు ప్లాన్ ఏంటంటే?

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (17:28 IST)
కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మరో 19 రోజుల పాటు పొడగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీనిపై కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ స్పందించారు. కరోనాపై భారతావని చేస్తున్న పోరాటంలో లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న ఆలోచన కేవలం ఓ గేమ్ చేంజర్ అని వ్యాఖ్యానించారు. 
 
కరోనాపై పోరులో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఓ ప్రణాళికను సిద్ధం చేశారని, దీనిపై బుధవారం ఓ కీలక ప్రకటన వెలువడనుందని తెలిపారు. మార్చి 24 అర్థరాత్రి నుంచి లాక్‌డౌన్ విధించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సానుకూలంగా స్పందించారని చెప్పారు. 
 
అలాగే, వచ్చే 19 రోజుల పాటు కూడా ఇదే విధమైన సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 20 తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన లాక్‌డౌన్ వ్యూహంపైనా కేంద్రం నుంచి సలహాలు, సూచనలు అందుతాయని, ఆపై రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా, ఆయా ప్రాంతాల్లోని సౌలభ్యాల ప్రకారం నిర్ణయాలు తీసుకోవచ్చని జావదేకర్ సూచించారు.
 
ఎన్నో ప్రపంచ దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని, విజయం సాధించలేక అల్లాడుతున్నాయని, దేశ ప్రజలంతా విధిగా అన్ని నిబంధనలూ పాటిస్తే, కరోనాపై యుద్ధంలో తప్పక గెలిచితీరుతామన్నారు. కేంద్రానికి ప్రజల మద్దతు తప్పనిసరని అభిప్రాయపడ్డ జావదేకర్, ఈ మహమ్మారికి విరుగుడును శాస్త్రవేత్తలు త్వరగా కనిపెట్టాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments