Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బారిన పడిన నితిన్ గడ్కరీ.. స్వల్ప లక్షణాలతో..?

Webdunia
బుధవారం, 12 జనవరి 2022 (13:06 IST)
ఇటీవలి కాలంలో కరోనా బారిన పడుతున్న మంత్రులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీల జాబితా పెరిగిపోతోంది. ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ కరోనా బారిన పడిన నేపథ్యంలో తాజాగా కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధ్రువీకరించారు. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయి.
 
"నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలున్నాయి. అన్ని ప్రొటోకాల్స్‌ను పాటిస్తూ నాకు నేనుగా ఇంట్లోనే ఐసోలేట్ అయ్యాను. హోం క్వారంటైన్‌లో ఉన్నాను. గత కొద్దిరోజులుగా నన్ను కలిసిన వారు ఐసోలేట్ అయ్యి టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.." అంటూ గడ్కరీ ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీహార్ సీఎం నితీశ్ కుమార్ వంటి వారికి కరోనా సోకిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments