Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత - ఆస్పత్రిలో చేరిక

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (15:43 IST)
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన విశ్వాంతి గదికి తరలించి, అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు. ఆయన గురువారం నార్త్ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో రూ.1206 కోట్ల వ్యయంతో చేపట్టే జాతీయ రహదారుల నిర్మాణ శంకుస్థాపనల కోసం వెళ్లారు. అక్కడ వేదికపై ఉండగా ఆయన అస్వస్థతకు లోనయ్యారు. 
 
ఆ వెంటనే అధికారులు కార్యక్రమాన్ని నిలిపివేసి పక్కనే ఉన్న గ్రీన్ రూమ్‌కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి సెలైన్ ఎక్కించారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గినట్టు వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత సిలిగురి నుంచి ఒక సీనియర్ వైద్యుడుని పిలిపించి వైద్యం చేశారు. 
 
ఆ తర్వాత డార్జిలింగ్ బీజేపీ ఎంపీ రాజు బిస్తా మంత్రి గడ్కరీని తన నివాసానికి తీసుకెళ్లారు. పిమ్మట మటిగారలోని తన నివాసంలో గడ్కరీకి చికిత్స అందించేలా ఏర్పాట్లుచేశారు. ప్రత్యేక వైద్య బృందం ఎంపీ నివాసానికి చేరుకుని వైద్యం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments