Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అస్వస్థత - ఆస్పత్రిలో చేరిక

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (15:43 IST)
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన విశ్వాంతి గదికి తరలించి, అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు. ఆయన గురువారం నార్త్ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో రూ.1206 కోట్ల వ్యయంతో చేపట్టే జాతీయ రహదారుల నిర్మాణ శంకుస్థాపనల కోసం వెళ్లారు. అక్కడ వేదికపై ఉండగా ఆయన అస్వస్థతకు లోనయ్యారు. 
 
ఆ వెంటనే అధికారులు కార్యక్రమాన్ని నిలిపివేసి పక్కనే ఉన్న గ్రీన్ రూమ్‌కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి సెలైన్ ఎక్కించారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గినట్టు వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత సిలిగురి నుంచి ఒక సీనియర్ వైద్యుడుని పిలిపించి వైద్యం చేశారు. 
 
ఆ తర్వాత డార్జిలింగ్ బీజేపీ ఎంపీ రాజు బిస్తా మంత్రి గడ్కరీని తన నివాసానికి తీసుకెళ్లారు. పిమ్మట మటిగారలోని తన నివాసంలో గడ్కరీకి చికిత్స అందించేలా ఏర్పాట్లుచేశారు. ప్రత్యేక వైద్య బృందం ఎంపీ నివాసానికి చేరుకుని వైద్యం చేసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments