Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో పల్స్ పోలియాను ప్రారంభించిన కేంద్ర మంత్రి

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (17:33 IST)
పల్స్ పోలియో కార్యక్రమాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుక్ మాండవీయ ఢిల్లీలో ప్రారంభించారు. పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డేను పురస్కరించుకుని ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులోభాగంగా, ఐదేళ్ళలోపు చిన్నారులకు కేంద్ర మంత్రి పోలియో చుక్కలు వేశారు. అలాగే, ఐదేళ్ళలోపు ప్రతి ఒక్క చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు. 
 
ఇదిలావుంటే, పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన వైద్య ఆరోగ్య శాఖలు ఏర్పాట్లు పూర్తిచేశాయి. ఈ నెల27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకు కార్యాచరణ రూపొందించారు. 
 
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రయాణ ప్రాంగణాలు, రైల్వే స్టేషన్లు, బస్టు స్టేషన్లు, విహార కేంద్రాల్లో ప్రత్యేక కేంద్రాలు, మొబైల్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ కార్మికుల పిల్లలను గుర్తించి ఈ పోలియో చుక్కలు వేస్తారు. 
 
ఈ నెల 27న గ్రామాలు, పట్టణాల్లో పోలియో చుక్కలు వేస్తారు. మొదటి రోజు వేసుకోనివారికి 28వ తేదీన చుక్కలు వేస్తారు. మార్చి ఒకటో తేదీన వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టి పోలియో చుక్కలు వేసుకోని వారిని గుర్తించి వారికి పోలియో డ్రాప్స్ వేసేలా చర్యలు తీసుకోనున్నారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments