Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశవ్యాప్తంగా 24 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం: అరుణ్ జైట్లీ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017-18వ బడ్జెట్‌లో దేశ వ్యాప్తంగా 24 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన

Webdunia
గురువారం, 1 ఫిబ్రవరి 2018 (15:10 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017-18వ బడ్జెట్‌లో దేశ వ్యాప్తంగా 24 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా ప్రవేశపెట్టిన ఈ సంపూర్ణ బడ్జెట్‌లో అరుణ్ జైట్లీ.. ఉచిత వైద్య సేవల పథకం కోసం ఆరోగ్య శాఖకు రూ.1,200 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. 
 
ఈ పథకం కింద 50 కోట్ల మంది లబ్ధి పొందారని అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. అంతేగాకుండా జాతీయ ఆరోగ్య భద్రతా పథకం ద్వారా పది కోట్ల పేద కుటుంబాలకు ఉచిత వైద్య బీమాను అందిస్తామని, టీబీ రోగులకు వైద్యం అందించేందుకు రూ. 600కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 
 
ఆయుష్మాన్ పథకం కింద పలు లక్షల ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి. దేశ వ్యాప్తంగా 24 జిల్లా ఆస్పత్రులను అభివృద్ధి చేసే దిశగా మెడికల్ కాలేజీలను, ఆస్పత్రుల కోసం ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments