Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతానంకోసం చిన్నారిని బలిచ్చిన ఓ మహిళ

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (15:46 IST)
ఓ మహిళ తన సంతానం కలగకపోవడంతో రెండేళ్ళ చిన్నారిని ఓ మహిళ బలిచ్చింది. పిల్లలు పుట్టకపోవడంతో మాంత్రికుడ్ని ఆశ్రయించిన ఆ మహిళ.... బాలుడి ప్రాణాల తీసింది. ఈ విషాదకర ఘటన ఢిల్లీలోజరిగింది.
 
రోషిణీ ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల మహిళకు 2013లో వివాహమైంది. అయితే, ఆమెకు పిల్లలు కలగక పోవడంతో తోడికోడళ్లు, మెట్టింటి వారు హేళన చేయసాగారు. 
 
ఇది భరించలేక నాలుగేండ్ల కిందట పుట్టిల్లు అయిన ఉత్తరప్రదేశ్‌లోని హార్డోయిలో క్షుద్రపూజలు చేసే ఒక వ్యక్తిని ఆశ్రయించింది. సంతానం కలుగాలంటే ఒక చిన్నారిని బలి ఇవ్వాలని అతడు సూచించాడు.
 
ఈ నేపథ్యంలో ఢిల్లీలో నివాసం ఉంటున్న ఆ మహిళ పొరుగున్న ఉన్న రెండున్నర ఏండ్ల బాలుడ్ని చంపాలని నిర్ణయించుకున్నది. శనివారం పక్క బిల్డింగ్‌ మేడపై ఒంటరిగా ఆడుకుంటున్నఆ చిన్నారి గొంతునులిమి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఒక బ్యాగ్‌లో అక్కడ ఉంచింది.
 
మరోవైపు తమ కుమారుడు కనిపించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ చిన్నారి గురించి పోలీసులు ఆరా తీసి గాలించగా బిల్డింగ్‌ మేడపై ఒక బ్యాగ్‌ కనిపించింది. 
 
దానిని తెరిచిచూడగా బాలుడి మృతదేహం అందులో ఉన్నది. దీనిపై దర్యాప్తు చేయగా ఆ చిన్నారిని తానే చంపినట్లు ఆ మహిళ ఒప్పుకున్నది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments