Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపిస్టులకు తలకిందులుగా వేలాడదీసి.. చితకబాది.. దెబ్బలపై కారం పూయాలి: ఉమాభారతి

తరచూ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తాజాగా అత్యాచార దోషులపై విరుచుకుపడ్డారు. సర్జికల్‌ దాడులపై అనుమానాలు వ్యక్తంచేసిన వారిని వెళ్లి పాకిస్థాన్‌ పౌరసత్వం తీసుకోమని గతం

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (17:35 IST)
తరచూ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తాజాగా అత్యాచార దోషులపై విరుచుకుపడ్డారు. సర్జికల్‌ దాడులపై అనుమానాలు వ్యక్తంచేసిన వారిని వెళ్లి పాకిస్థాన్‌ పౌరసత్వం తీసుకోమని గతంలో వ్యాఖ్యానించిన ఉమాభారతి.. అత్యాచారాలకు పాల్పడిన వారికి చుక్కలు చూపించాలన్నారు. 
 
అత్యాచారాలకు పాల్పడిన వారు తమను బతకనివ్వమని వేడుకోవాలి.. అలాంటి వారిని తలకిందులుగా వేలాడదీసి చితకబాది వారి దెబ్బలపై కారం పూయాలి. వాళ్లు గట్టి గట్టిగా ఏడుస్తుంటే.. అరుస్తుంటే బాధిత మహిళలు చూడాలని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రేపిస్ట్‌ల భరతం పట్టానని ఉమాభారతి తెలిపారు. రేపిస్టులను హింసించి, క్షమించమని బాధితుల కాళ్లు పట్టుకునేలా చేశానన్నారు.
 
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ప్రచార సభలో మాట్లాడుతూ.. బాధితుల ముందు రేపిస్టుల భరతం పట్టాలి. దిక్కులేక వాళ్లు క్షమించమని బాధితుల కాళ్ల మీద పడాలి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే చేయించాను' అని పేర్కొన్నారు. తాను గతంలో పోలీసులకు అలాగే చేయమని చెప్పానని వెల్లడించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments