Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుడు పోసుకున్న వెంటనే ఆధార్ - ఆస్పత్రుల్లోనే జారీ

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (12:36 IST)
దేశ పౌరుందరికీ ఆధార్ నంబరును కేంద్రం కేటాయిస్తుంది. ఇపుడు ప్రతి ఒక్కదానికి ఆధార్ నంబరును అనుసంధానం చేస్తున్నారు. పిల్లల చదువులకే కాదు.. ప్రభుత్వ సంక్షేమ పథకం పొందేందుకు, బ్యాంకు ఖాతా తెరిచేందుకు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేందుకు ఇలా ప్రతి ఒక్కదానికి ఆధార్ నంబరు తప్పనిసరి అయింది. 
 
దీంతో ఇకపై పుట్టిన వెంటనే ఆధార్ నంబరును జారీచేసేందుకు కేంద్రం సన్నాహాలు చేపట్టింది. ఈ నంబరును ఆస్పత్రుల్లోనే జారీ చేసేలా చర్యలు తీసుకోనుంది. ఇదే అంశంపై రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్ విభాగం అధికారులతో చర్చలు జరుపుతోంది. 
 
నిజానికి ఐదేళ్ళలోపు చిన్నారులకు బయోమెట్రిక్ లేదు. అందువల్ల తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఆధార్ కార్డుతో దానిని అనుసంధానిస్తారు. ఐదేళ్ళ తర్వాత ఆ చిన్నారి బయోమెట్రిక్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
కాగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 99.7 శాతం మంది (137 కోట్లు)కి ఆధార్ కార్డులు జారీచేసిటన్టు చెప్పారు. ప్రతి యేడాది రెండు నుంచి రెండున్నర కోట్ల మంది జన్మిస్తున్నారని, వారికి పుట్టిన వెంటనే ఆధార్ నంబరును జారీ చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఆధార్ సంస్థ సీఈవో సౌరభ్ గార్గ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం