Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనాకు ఉద్ధవ్‌ ఠాక్రే వార్నింగ్

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (23:23 IST)
తన మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి, నటి కంగనా రనౌత్‌కు మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనా వ్యవహారంపై సిఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఘాటుగా స్పందించారు.

తన మౌనాన్ని బలహీనతగా భావించవద్దని, ప్రస్తుతం తన దృష్టి మొత్తం కరోనా కట్టడిపైనే ఉందని, రాజకీయాలపై ఇప్పుడేమీ మాట్లాడనని పేర్కొన్నారు. మహారాష్ట్రను అపఖ్యాతి పాలు చేయడానికి కుట్ర పన్నుతున్నారని, సరైన సమయంలో దీనిపై స్పందిస్తానని అన్నారు. మహారాష్ట్రను బద్నాం చేయడానికి కొందరు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

వీటన్నింటిపై సరైన సమయంలో సిఎం ప్రొటోకాల్‌ పక్కన పెట్టి మరీ స్పందిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ తగ్గిందని, ఈ నెల 15 నుంచి 'నా కుటుంబం - నా బాధ్యత' కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు.

ఇందులో భాగంగా వైద్యులు ప్రతి ఇంటికీ వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను పరీక్షిస్తారని తెలిపారు. ప్రతి ఇంట్లో వైద్య పరీక్షలు కొనసాగుతాయని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments