Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనాకు ఉద్ధవ్‌ ఠాక్రే వార్నింగ్

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (23:23 IST)
తన మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి, నటి కంగనా రనౌత్‌కు మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనా వ్యవహారంపై సిఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఘాటుగా స్పందించారు.

తన మౌనాన్ని బలహీనతగా భావించవద్దని, ప్రస్తుతం తన దృష్టి మొత్తం కరోనా కట్టడిపైనే ఉందని, రాజకీయాలపై ఇప్పుడేమీ మాట్లాడనని పేర్కొన్నారు. మహారాష్ట్రను అపఖ్యాతి పాలు చేయడానికి కుట్ర పన్నుతున్నారని, సరైన సమయంలో దీనిపై స్పందిస్తానని అన్నారు. మహారాష్ట్రను బద్నాం చేయడానికి కొందరు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

వీటన్నింటిపై సరైన సమయంలో సిఎం ప్రొటోకాల్‌ పక్కన పెట్టి మరీ స్పందిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ తగ్గిందని, ఈ నెల 15 నుంచి 'నా కుటుంబం - నా బాధ్యత' కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు.

ఇందులో భాగంగా వైద్యులు ప్రతి ఇంటికీ వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను పరీక్షిస్తారని తెలిపారు. ప్రతి ఇంట్లో వైద్య పరీక్షలు కొనసాగుతాయని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments