Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే బహిరంగ సవాల్ : దమ్ముంటే నా ప్రభుత్వాన్ని కూల్చండి

Webdunia
శనివారం, 25 జులై 2020 (12:31 IST)
ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బహిరంగ సవాల్ విసిరారు. ప్రతిపక్ష బీజేపీకి దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని కూల్చాలని విసిరారు. బీజేపీతో తమ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని, తమ ప్రభుత్వం 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై శివసేన అధికారిక పత్రిక 'సామ్నా' ఆయనను ఇంటర్వ్యూ చేసింది. 
 
మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం కూలిపోవడం, రాజస్థాన్‌లో అస్థిరతపై ఆయన స్పందిస్తూ, అంతర్జాతీయ సంబంధాలపై కేంద్ర ప్రభుత్వానికి ఓ క్లారిటీ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. 'ఈ రోజు మనం చైనాను వ్యతిరేకిస్తున్నాం. కానీ... రాబోయే రోజుల్లో చైనా - భారత్ మిత్ర దేశాలుగా మారొచ్చు. అంతర్జాతీయ సంబంధాలపై మనం మరింత కష్టపడాల్సి ఉంటుంది. మరింత స్పష్టత రావాల్సి ఉంది' అని ఉద్ధవ్ పేర్కొన్నారు. 
 
తమ ప్రభుత్వం పూర్తి ఐదేళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. చైనాతో విభేదాలపై స్పందిస్తూ అంతర్జాతీయ సంబంధాల విషయంలో కేంద్రానికి స్పష్టమైన వైఖరి ఉండాలన్నారు. ప్రస్తుతం మనం చైనాను వ్యతిరేకిస్తున్నప్పటికీ భవిష్యత్తులో అదే మనకు మిత్ర దేశంగా మారే అవకాశాలను కొట్టిపడేయలేమన్నారు. కాబట్టి అంతర్జాతీయ సంబంధాల విషయంలో మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments