Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయ్‌పూర్ టైలర్ హత్య కేసు : 32 మంది ఐపీఎస్ అధికారులపై బదిలీవేటు

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (12:25 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్‌లాల్ హత్య కేసు ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యపై దేశ వ్యాప్తంగా నిరసనలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ప్రభుత్వం కన్నెర్రజేసింది.

సుమారు 32 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ హత్య కేసులో పోలీసులపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. 
 
కాగా, బీజేపీ నేత నుపుర్ శర్మకు మద్దతుగా వ్యాఖ్యలు చేసినందుకు టైలర్ కన్హయ్యను ఇద్దరు వ్యక్తులు దారుణంగా మెడ నరికి హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో రియాజ్ అక్తారీ, గౌస్ మొహ్మద్‌లను కూడా అరెస్టు చేశారు. 
 
ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టింది. పాకిస్థాన్‌లోని దావత్ ఏ ఇస్లామీ గ్రూపుతో నిందితులకు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం