Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయ్‌పూర్ టైలర్ హత్య కేసు : 32 మంది ఐపీఎస్ అధికారులపై బదిలీవేటు

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (12:25 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్‌లాల్ హత్య కేసు ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యపై దేశ వ్యాప్తంగా నిరసనలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ప్రభుత్వం కన్నెర్రజేసింది.

సుమారు 32 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ హత్య కేసులో పోలీసులపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. 
 
కాగా, బీజేపీ నేత నుపుర్ శర్మకు మద్దతుగా వ్యాఖ్యలు చేసినందుకు టైలర్ కన్హయ్యను ఇద్దరు వ్యక్తులు దారుణంగా మెడ నరికి హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో రియాజ్ అక్తారీ, గౌస్ మొహ్మద్‌లను కూడా అరెస్టు చేశారు. 
 
ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టింది. పాకిస్థాన్‌లోని దావత్ ఏ ఇస్లామీ గ్రూపుతో నిందితులకు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం